స్వాగతం,
వడ్డెర రిజర్వేషన్ పోరాట సమితి (వీఆర్పీఎస్) కేవలం సంఘం మాత్రమే కాదు ఇది దేశంలోనే వడ్డెర్లకు అందించాల్సిన అన్ని వసతులు, రిజర్వేషన్లు, అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఒక సంస్థగా కూడా చెప్పవచ్చు. ఏ సంఘమైన కేవలం కొంత మేరకే అభివృద్ధి కార్యక్రమాల కోసం పోరాడుతుంది. కాని వీఆర్పీఎస్ అనేది దేశవ్యాప్తంగా ఉన్న వడ్డెర్ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సాధ్యమైనంత వరకు మొక్కవోని దీక్షతో కృషి చేస్తూ ముందుకు సాగుతుంది.
నిప్పుల కొలిమిలో నలిగిన బంగారమే, అందరినీ సంతోషపెట్టే అభరణం అవుతుంది, సమాజంలో గుర్తింపు లెని జాతులు, తెగలలో ఎదురైన అవమానాలు, బాధలు, రాజ్యాంగ శిల్పి, వెనుకబడిన వర్గాల దేవుడు డాక్టర్, బి.ఆర్ అంబేద్కర్ గారిని దేశానికి అందించాయు, ఆదే విధంగ స్వాతంత్ర్యం దేశానికి వచ్చింది కానీ వడ్డెర కులానికి కాదు అన్నట్టు అనె స్థితిలో ఉన్న వడ్డెర కులంలో, కుల వృత్తులు ఆయిన భవన నిర్మాణ కార్మిక కుటుంబంలో పుట్టి, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ, 'లా' డిగ్రీ పూర్తీ చేసిన న్యాయవాది, క్వారిలలో రాతి పనీ చెసే కుంటుంబం నుండీ ఉన్నత విద్యావంతులుగా ఎదిగిన మారో ఇద్దరు యువకులు, ఇ ముగ్గురి ఆలోచనల కలయిక, రాబోవు తరాలకు స్వేచ్ఛ వాయువు సాధన దిశగ ఏదో ఒకటి చెయ్యాలి.... అసలు మన జాతి వెనుకబాటుకు కారణం ఏమిటి, అనె వీరి అలోచనకు దొరికిన సమాధానం, ఆర్ధికంగా, సామాజికంగా, విధ్య ఉద్యోగ పరంగా సమాజంలో అట్టడుగు స్థానంలో ఉండడం, మరి ఇ పరిస్థితులలో మర్పు కోసమే కధ రిజర్వేషన్లు, ఏర్పడింది, అయిన కూడా, వడ్డెర జాతి పరిస్తితి ఎందుకుఇలా వుంది అని, శోధించి సాధించి తెలుసుకున్నది ఒక్కటే నాడు రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియలో వడ్డేర్లకు జరిగిన అన్యాయం , వడ్డెర జాతి భవిష్యత్తూ మనుగడ సాధించాలి , భావితరాలు స్వేచ్ఛగ బ్రతకాలి అంటె నాడు న్యాయంగ రావాల్సిన రిజర్వేషన్, అది సాధించడం కోసం సమిష్టి పోరాటం అవసరం అనె అలోచనే , 'వడ్డెర రిజర్వేషన్ పోరాటసమితి' ఆవిర్బానికి మూలకారణం. సామాన్యమైన కుటుంబాలలో పుట్టిన ముగ్గురు ఉన్నత విద్యావంతులుగా ఎదగడానికి పడ్డ కష్టాల, విధ్య ఉద్యోగం ఉపాధి, వంటి వాటిలో వీరు ఎదుర్కొన్న కష్టాలను వడ్డెర జాతి బిడ్డలకు దూరం చేయ్యాలి అనె అసామాన్యమైన దీక్షకు దిక్సూచి, ఒక తాపీ మేస్త్రి( భవన నిర్మాణం )పని చేసుకునే కుటుంబంలో పుట్టిన గుంజి సంతోష్ కుమార్, వడ్డే రాజ్ (న్యాయవాది), మరియు తమ్మిశెట్టి శివకృష్ణ (సైన్స్ పరిశోధన విద్యార్థి), బత్తుల ఉఎంద్ర (జర్నలిస్టు)లు.
వీఆర్పీఎస్ వ్యవస్థాపకుడు
వి ఆర్ పి ఎస్ వ్యవస్థాపకులు లో ఒక్కడు
వి ఆర్ పి ఎస్ వ్యవస్థాపకులు లో ఒక్కడు
VRPS చే నిర్వహించబడే కార్యక్రమాలు మరియు ఇతర సమాచారం ఇక్కడ జోడించబడతాయి.
మార్చ్ 15, 2022., 60 ఏళ్ల వడ్డెర చరిత్రలో జరిగిన మొదటి చలో అసెంబ్లీ ఇప్పుటి వరకు ఏ వడ్డెర సంఘం నాయకులు కూడా ఈ చలో అసెంబ్లీని నిర్వహించలేదు , వడ్డెర రిజర్వేషన్ పోరాటం సమితి అధ్యక్షుడు, శ్రీ గుంజి సంతోష్ కుమార్ నాయకత్వంలో ఇదే మొదటిది . హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగిన సమావేశంలో అందుబాటులో ఉన్న నాయకులతో చర్చించి అంధులో తీసుకున్న వివిధ నిర్ణయాలలో ,గుంజి సంతోష్ కుమార్ వడ్డెరాజు గారి ప్రతిపాదన అసెంబ్లి ముట్టడి వివిధ వడ్డెర సంగల నాయకత్వం దినికి ముందడుగు వెయ్యని సందర్బం లో , వీఆర్పీఎస్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది వడ్డెరలతో చలో అసెంబ్లీ జరిగింది . కొంత మంది హైదరాబాద్ స్తానిక సంగాల సహకారంతో అసెంబ్లి ముట్టడి విజయవంతం అయ్యింది.
2 సెప్టెంబర్ 2022 న వడ్డెర జాతీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వీఆర్పీఎస్ ఆధ్వర్యంలో వందల మందితో తెలంగాణాలో అసెంబ్లీ ముట్టడి చేశాము. తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి వేలమంది వడ్డెర సోదరులు ఈ ముట్టడికి సహకరించి విజయవంతం చేయ్యాలి అని సిద్ధం అయినప్పటికీ, వారందరిలో చాలా మందిని ఈ అసెంబ్లీ ముట్టడికి రాకుండా ఆపాలి అని చూసిన పోలీసులు చాలా వరకు సఫలం అయ్యారు, మన వడ్డెర బిడ్డలను, యువకులను, వివిధ వడ్డెర సంఘాల నాయకులను ఎక్కడికక్కడ ఇండ్ల వద్దే నిర్భందించి గృహ నిర్భంధం, పోలిసు స్టేషన్ నిర్బంధాన్ని , అమలు చేసీ వడ్డెర్లను భయ బ్రాంతులకు గురిచేశారు, అయినప్పటికి చాలా మంది వడ్డెర యువత వీఆర్పీఎస్ పిలుపుకు గౌరవించి, అధ్యక్షులు న్యాయవాది కావడంతో వడ్డెర జనంలో ధైర్యం నిపడంలో సఫలీకృతం అవ్వడటం వల్ల, యువత ముట్టడికి ముందుకు వచ్చి , ముట్టడిని విజయ వంతం చేసారు. వూరు ధాటి ముట్టడికి వచ్చిన చాలా మంది మన వడ్డెర, కులస్థులకు పోలీసుల నుంచి ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చినప్పటికి వారు వెనుదిరగక, ధైర్యంగా ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు, వారి సాహసానికి వీఆర్పీఎస్ కృతజ్ఞతలు తెలిపింది.
ఎట్టకేలకు 2023 అసెంబ్లీలో కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ . తెలంగాణ అసెంబ్లీలో కేపీ వివేకానంద వడ్డెర ఎస్టీ డిమాండ్ లేవనెత్తారు . వడ్డెరలు న్యాయం కోసం వేడుకున్నారు
బీసీ మేధావులు & రాజకీయ నేతలు మద్దతు వడ్డెర ఎస్టీ రిజర్వేషన్ డిమాండ్ : ఈ తారాగణంలో వెనుకబడిన మరియు అత్యంత వెనుకబడిన కులాలలో 50 నుండి 100 పైబడిన కులాలు కూడా ఉన్నాయి , ఇవి ఉమ్మడి రాష్ట్రమైన AP మరియు తెలంగాణకు మద్దతు ఇస్తున్నాయి , ఈ కొన్ని మొత్తంగా , అన్ని ఇతర వర్గాల వారు అసెంబ్లీలో తమ సమ్మతిని వ్యక్తం చేసారు చేశారు . శ్రీ కిషన్ రెడ్డి , శ్రీ ఈటెల రాజేందర్ , కేపీ వివేక్ , గద్దర్ వరకు రాజకీయ పార్టీల అగ్రనేతలు , అధికారులు నేరుగా మద్దతు పలికారు . వడ్డెర ఉద్యమం తీవ్రత వడ్డెర (vrps ) ఉద్యమం 1990 ఇప్పటి వరకు ST రిజర్వేషన్ డిమాండ్ కోసం . వడ్డెర ఉద్యమంలో పాల్గొని పోలీసు కేసులు పెట్టి కోర్టులో కొనసాగుతున్నారు . , వడ్డెలు అన్ని అవకాశాలను కోల్పోయారు . బీసీ రిజర్వేషన్ల కోటాను మరింత పెంచాలని వీఆర్పీఎస్ డిమాండ్ చేయలేదు , వడ్డెరలకు ప్రత్యేక కోట కూడా కోరలేదు . వారి సామాజిక స్థితికి అనుగుణంగా వారికి సరైన ఎస్టీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు .
1942, వడియరాజా క్షత్రియ సంగం, కీర్తిశేషులు, శ్రి కే , టీ , వెంకట స్వామి రాజు గారి చెతుల మీద పురుడు పోసుకుని వడ్డెర కుల అభివృద్ధి హక్కులు కోసం బ్రిటీషు వారి హయాంలో సైతం వడ్డేరాజులం అనె నినాదంతో వెంకట స్వామి రాజు గారు, వెనుకబడిన జాతిలో చైతన్యజ్యోతి వెలిగించడానికి నిరంతరం కృషి చేశారు, ఆంధ్ర ప్రదేశ్ అవతరణ తర్వాత తెలంగాణ ప్రాంతం ఆంద్ర రాయలసీమలో అత్యధిక వెనుకబాటుకు గురికావడం చదువు లేకపోవడం, హక్కులు తెలియకపోవడంతో రాజకీయంగా ప్రాతినిధ్యం లేకపోవడం మొదలగు కారణాల వల్ల ఒకానొక సమయంలొ వడ్డెర అనె పదానికి కులాల జబితాలో స్థానం లెని పరిస్థితి 2015 వరకు కొనసాగింది 1990, ఆంధ్ర ప్రదేశ్ వడ్డి,వడ్డే , వడ్డీలు వడ్డే సంక్షేమ సంఘం , గన్ను దెబ్బ , అఖిల భారత వడ్డెర వడ్డే, భోవిసంక్షేమ సంగం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మరికొన్ని సంఘాలు, జాతీయ వడ్డెర సంగం లాంటి పుట్టుకు వచ్చాయి, ఇవ్వన్నీ కుడా అంతో ఇంతో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఉనికిలో ఉన్నప్పటికీ ఆ తరువాత తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏ సంగం కూడా అంతగా వడ్డెర హక్కుల కోసం గట్టిగా పోరాటాలు చేసిన సందర్బాలు లెని పరిస్థితి, తెలంగాణా ఏర్పడ్డాక కూడా కొన్ని సంఘాలు పనిచేసిన అవి కేవలం వారి పరిధిలో కొన్నీ కొన్నీ సేవాకార్యక్రమాలు పరిమితం కావడం , ప్రభుత్వానికి అంటుకాగి వ్యతిరేఖ ఉద్యమాలు చేయలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితులు చూసాక, విద్యార్థి నాయకుడు VRPS అధ్యక్షుడు గుంజి సంతోష్ కుమార్ వడ్డేరాజ్ అలోచనకు ప్రతిరూపంగా వడ్డెర సమాజం జిందాబాద్ లు కొట్టడం మానేసి జీవితాలు బాగుచేసుకోవాలి, మత్తు నిద్ర వదిలి హక్కుల పోరటం చెయ్యాలి, గతంలో విద్యలెని నాయకులు, నీతిలేని నాయకులు చేసిన పాపం ఫలితం ప్రస్తుత తరాలు అనుభవిస్తున్న బాధలు, భవిష్యత్తు తరాల కోసం బాధలు, బాధ్యతలు కాదు బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేద్దాం, అడగనిదే అమ్మా అయిన అన్నం పెట్టదు, మన హక్కులు కూడా అంతె, పోరాడకుండా ఫలితాలు రావు, పోరాడుదాం హక్కులూ సాధిద్ధం అధికారంలో భాగస్వాములుగా, భవిష్యత్తు తరాలకు స్థానం ఏర్పాటు అయ్యే వరకూ పోరాడుదాం అని గత 5సంవత్సరాల నుండి పోరాడుతున్న నాయకుని పోరాటానికి మరి కొంత మంది ఉన్నత విద్యావంతుల కలయిక ద్వార రెండూ సంవత్సరాల క్రితం ఏర్పడైనదే వడ్డెర రిజర్వేషన్ పోరాట సమితి (VRPS)
ఈ డిమాండ్ నెరవేరింది, ప్రభుత్వం సొంత ఖర్చులతో ప్రతిజిల్లలో ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
అడ్వొకేట్ గుంజి సంతోష్ కుమార్ తో పేస్ టూ పేస్ విత్ మహేష్ ఫుల్ ఇంటర్వ్యూ